కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన యువజన సంఘాల నాయకులు, జాతీయ అవార్డు గ్రహీత అలువాల విష్ణు సతీమణి అలువాల రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదంలో మెదడుకు తీవ్రంగా గాయాలు కావడంతో గురువారం రాత్రి మృతి చెందింది. ఆదివారం రాత్రి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విష్ణు కుటుంబాన్ని పరామర్శించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొమ్మరవేణి తిరుపతి ముదిరాజ్, మాజీ ఎంపీపీ జవ్వాజి హరీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, దేశరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కోల రమేష్, మాజీ ఎంపీటీసీ ఎడవెల్లి నరేందర్ రెడ్డి, రేణిగుంట బాపురాజు, తడగొండ హన్మంతు, ముంజాల రాములుగౌడ్, కొలిపాక కమలాకర్, మాజీ సర్పంచ్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.