కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమెల మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో శిలాఫలకాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలివేరి నారాయణ,వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జీవన్ రెడ్డి,గోగూరి మహిపాల్ రెడ్డి, పిడుగు ప్రభాకర్ రెడ్డి,చంద్రమోహన్ రెడ్డి,గుడి మల్లికార్జున్ రెడ్డి,జితేందర్ రెడ్డి,నాయకులు, ప్రజలు,పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
