Manik Rao Leads BRS Campaign in Zahirabad
ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఝరాసంగం గ్రామాలలో బి.ఆర్.ఎస్ అభ్యర్థులు వినోద బాలరాజ్ తరపున శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, నామ రవి కిరణ్ మరియు ఝరాసంగం గ్రామ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియా గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టౌన్ ప్రెసిడెంట్ బాబా నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్ధల గెలుపు కొరకు కృషి చేయాలని అనంతరం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ మాట్లాడుతూ లియూరియా కోసం రైతుల అగచాట్లు, బోనస్ బకాయిలు, రైతు భరోసా ఎగవేత, చాలిచాలని కరెంటు, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. మహిళలకు 2500, వృద్ధులకు 4000, తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా విమర్శించారు..
