MLA Manik Rao Campaigns in Nyalakal Ahead of Sarpanch Polls
న్యాల్కల్ లో పర్యటించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా న్యాల్కల్ మండలం షంషీలపూర్,వడ్డీ, తాట్ పల్లి,చినిగేపల్లి ,ఇబ్రహీంపూర్,న్యాల్కల్ ,హద్నూరగ్రామాలలో పర్యటించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ గారి సహకారంతో నియోజకవర్గ గ్రామాలు.

ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం.
మళ్లీ గ్రామలు అభివృద్ధి చెందాలంటే .బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిలను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు

ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్ ,దీపక్ ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
