MLA Inaugurates New Mudiraj Cooperative Building
ముదిరాజ్ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనం రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించగా శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పిసిసి సభ్యులు పెండెం రామానంద్,పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి, నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
