అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.
చిట్యాల నేటి ధాత్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ని చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక సోషల్ వెల్ఫేర్ వెలుగు బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ డిడబ్ల్యు ఓ అధికారి చిన్నయ్య ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్నిసోమవారం రోజున గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోల్కొండ బిక్షపతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించా:రు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు.
అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు , ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీజ చిట్యాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు చిలుకల రాయకోమురు, దబ్బేట అనిల్ శ్రీనివాసు రాజమౌళి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు