పంగిడిపల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం
పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరుకున్నారు. (శనివారం) భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామంలో ముదిరాజ్ గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు, ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
పెద్దమ్మతల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజా పాలనలో మత్స్యకారులకు ఉపాధి మెరుపడిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ జెడ్పిటిసి తిరుపతి రెడ్డి కత్తి సంపత్ తోట గట్టయ్య శాస్త్రాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!