ఉప్పల్ ప్రైస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం కమిటీ
ఉప్పల్ నేటిధాత్రి
ఉప్పల్ ప్రైస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రమా కిషోర్ ని మరియు కమిటీ సభ్యులను ఆలయకమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పల్ సర్కిల్ అభివృద్ధిలో పాత్రికేయుల పాత్ర ఎంతైనా ఉందని సమాజంలో జరిగే అని విషయాలను ప్రజలకు తెలియజేస్తూ.. అభివృద్ధి మరియు సమస్యలను ఎత్తి చూపుతూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే భాధ్యతను వారు నిర్వహిస్తారని అన్నారు. చిల్కానగర్ శివాలయం పున్నరునిర్మాణంలో కూడా పాత్రికేయు సోదరుల సహాయ సహకారాలు ఉండాలని ఆలయకమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉప్పల్ ప్రైస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మరియు ఆలయకమిటీ సభ్యులు జెల్లీ మోహన్, గోనె అంజయ్య, గోపాల్ రెడ్డి, కావాలి నర్సింహ్మ, మాస శేఖర్, పైడిపాల గౌరయ్య, దండు అంజయ్య, పోలోజు శ్రీనివాస్ చారి, రుద్రరపు శంకర్, మాడుగుల శ్రీనివాస్ యాదవ్, కాసుల రామకృష్ణ, మల్లేష్ ముదిరాజ్, నాని ముదిరాజ్, పాల్గొన్నారు.
