ఎంబిబిఎస్ రెండో సంవత్సరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో యంబిబిఎస్ రెండో సంవత్సరం మెడికల్ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. యంబిబిఎస్ విద్యార్థులు మొదటిరోజు వంద పడకల ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, హెచ్.వో.డీ ల డాక్టర్ల పర్యవేక్షణలో పేషంట్లకు ట్రీట్మెంట్ చేసే విధానం, ఇతర మెలకువలు నేర్చుకునేందుకు వచ్చిన 88 మంది విద్యార్ధులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో పలువురు విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే సింగరేణి, డిఎంఎఫ్టి నిధులతో అభివృద్ధి చేసేలా చూస్తానని అన్నారు. ముఖ్యంగా లెక్చరల్ హాల్, క్యాంటీన్ స్టేషనరీ, బస్సు సౌకర్యం, వైఫై, సీసీ రోడ్లు తదితర సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వంద పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య అంబాల శ్రీనివాసు బౌత్ విజయ్ తోట రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!