ఎన్నికల ప్రచార నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర

ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్లు పాలేరులా పనిచేస్తా

భూపాలపల్లి నేటిధాత్రి

ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వేశాలపల్లిలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
నేరుగా ప్రజలను కలుస్తూ ఓటు అభ్యర్థిచిన గండ్ర వెంకట రమణా రెడ్డి వేశాలపల్లి ప్రధాన కూడలి వద్ద ఏర్పటు చేసిన సభను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానించి పూర్తి సహకారం అందిస్తాం అంటున్న తరుణం చాలా సంతోషం కలిగింది.
2009 కి ముందు అభివృద్ధి కి దూరంగా ఉన్న భూపాలపల్లి ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి
నేను ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత భూపాలపల్లి పరిసర గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది.రోడ్ల విస్తరణ,సేడ్ డ్రైన్ ల నిర్మాణలు చేపట్టి స్థానిక ప్రజాల జీవన ప్రమాణాలు పెంచడం జరిగింది.నేను రెండవ సారి ఎమ్మెల్యే గా గెలిచిన ప్రకృతి సహకరించక పోయిన మొదటి రెండు ఏళ్ళు కరోన లో అభివృద్ధి నామమాత్రంగా ఉన్న గడిచిన మూడు ఏళ్లలో ప్రభుత్వ సహకారంతో వేశాలపల్లి వార్డును ప్రత్యేక దృష్టితో సెంటర్ లైటింగ్ సిస్టం తో రోడ్డు ను నిర్మించుకున్నాం.
వేశాలపల్లి లో అత్యధికంగా ST సోదరులు ఎక్కవగా ఉంటారు.
ఒక్కసారి మీరు ఆలోచించాలి 60ఏళ్ల పాలనలో 6శాతం గా ఉన్న రిజర్వేషన్లను కేంద్ర సహజారించక పోయిన అసెంబ్లీలో ప్రత్యేకంగా చట్టం తెచ్చి 10శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం బి ఆర్ ఎస్ అని గుర్తు పెట్టుకోవాలి.
వేశాలపల్లి ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా రెండు పడకల ఇళ్లను నిర్మించుకున్నాం.
ముఖ్యమంత్రి రానున్న 5ఏళ్లకు సరిపడా మేనిఫెస్టో విడుదల చేశారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారో మాట ఇచ్చారు అంటే తప్పకుండా నెరవేర్చుతారు.
మరొక్క సారి అవకాశం కల్పించండి ఆగి ఉన్న అభివృద్ధి పనులను, రెండు పడకల ఇళ్ల నిర్మాణాలను,గృహలక్ష్మీ లను,బీసీ బంధు లను కొనసాగించుకుందాంఅని తెలిపారు.
నేను కుట్రలకు పోను, కుతంత్రాలు చేయను ఒక్కసారి వేటు వేస్తే 5ఏళ్ళు పాలేరు లెక్క పనిచేస్తా తప్ప పాలకుడిగా ఏ రోజు అనుకోను.
ఎన్నికల అనంతరం కేసీఆర్ చెప్పిన మేనిఫెస్టోలోని ప్రతి పథకాలను అమలు చేస్తాం
10వేలు ఉన్న రైతు బంధు 16000 లకు పెంచుతుంది
కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం క్రింద ఎలాంటి మరణం సభవించిన రూ.5లక్షల భీమా సౌకర్యం కల్పిస్తాం..
భీమా పథకం క్రింద రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డు ఉన్న 93లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది.
అన్నపూర్ణ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తాం..
1200 ఉన్న గ్యాస్ ధరలను రేపు అధికారంలోకి రాగానే 400కె వంట గ్యాస్ అందించడం జరుగుతుంది.
రాష్ట్రంలో ఇంటి జాగా లేని నిరుపేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలను సమకూర్చడం జరుగుతుంది.
కల్పిస్తుంద
2016 ఉన్న ఆసరా పెన్షన్ లను 5016, 3016 ఉన్న దివ్యంగులా పెన్షన్ ను 6000 అందిస్తారు.
కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలకు 15లక్షల వరకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పిస్తుంది.
సౌభాగ్య లక్ష్మీ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన ఒంటరి మహిళలకు ప్రతి నెల 3000 లను అందిస్తుందని తెలిపారు. 11వ వార్డు కౌన్సిలర్ రజిత జమ్మూలాల్ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్ధు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ రమేష్ టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రాజు వార్డు అధ్యక్షుడు రాజు పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!