
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం కాంగ్రెస్ పార్టీ రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు బుధవారం రోజు మండల కేంద్రంలోని 33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే విజిట్ చేశారు అనంతరం సబ్ స్టేషన్లో ఉన్న లాక్ బుక్స్ ను తనిఖీ చేసి, ఆపరేటర్లకు పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అవి సరికాదని అన్నారు. కరెంటు కోతలు ఎక్కడా లేవని, గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలు నాశనం అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా చేస్తే ఊరుకునేది లేదన్నారు నిరంతర విద్యుత్ సరఫరా కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపాక రాజేందర్ మండల వైస్ ఎంపీపీ విడుదనేని అశోక్ గణపురం సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి చోట మియా ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ వార్డ్ మాజీ మెంబర్ మండ అశోక్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు దూడపాక దుర్గయ్య సీనియర్ నాయకులు శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు