
ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించాలి.
ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో పది సంవత్సరాల క్రితం మాజీ సర్పంచ్ దొంతుల చందర్ హయాములో ఎస్సీ కమ్యూనిటీ హాలు బేస్ మెంట్ లెవల్ పిల్లర్లు పోసి వదిలిపెట్టారు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం శిలాఫలకం 5.10.20.23
తారీకు నాడు వేసినారు సి డి ఎఫ్ నిధులు నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేసినారు మరి ఆ రోజు నుండి ఇప్పటివరకు లోపం ఎవరిది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను అని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు ఇప్పటికైనా నవాపేట దళితుల పైన గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే స్పందించి ఎస్సీ కమ్యూనిటీ హాలు కోసం అధికారులనుపిలిపించుకొని రిఎస్ట్మెంట్ వేసి 20 లక్షల రూపాయల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సిసి రోడ్డు నిర్మాణం కూడా కాంటాక్ట్ ను పిలిపించి సిసి రోడ్డు పనులు జరిగే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రాజ పోశయ్య. రాజయ్య సురేష్ రాజు రవి రాములు భద్రయ్య రాము దుర్గయ్య లక్ష్మయ్య పోశయ్య కుమారు చేరాలు సూర్యకిరణ్ సాంబయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.