ఐజేయు డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కమార్, ప్రధాన కార్యదర్శి సామంతుల శ్యామ్ ఆధ్వర్యంలో ఐజేయు డైరీని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి ఐజేయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు .
అనంతరం జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పదుగుంటల అనువైన స్థలంతో పాటు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తానే స్వయంగా ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలంతో పాటు నిధులు మంజూరు చేసి అన్ని అంగులతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది .
అదేవిధంగా జిల్లాలోని 11 మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు స్వచ్ఛందంగా ఇంటి స్థలాలు రాని వారు వారి పేర్లను అందిస్తే స్థలాలు మంజూరు చేసే దిశగా ప్రయత్నం చేస్తానని, ఐజేయు నాయకులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హామి ఇవ్వడం జరిగింది.
ప్రెస్ క్లబ్ భవనం పూర్తి నిర్మాణాన్ని చేపడతానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు జిల్లాలో ఇళ్ల స్థలాలు రాణి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడంతో భూపాలపల్లి జిల్లా ఐజేయు నాయకులు ఎమ్మెల్యే సత్యనారాయణ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీపీఆర్ఓ శ్రీనివాస్ ఐజేయు జిల్లా కోశాధికారి కుమార్ యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామల శ్రీనివాస్, టెంజు జిల్లా అధ్యక్షుడు సాంబయ్య,చిన్న పత్రికల సంఘం అద్యకుడు చంద్రశేఖర్, రజినికాంత్ ,చిట్యాల అధ్యక్షుడు రాము, ఐలయ్య యాదవ్,రమేష్ ,చిరంజీవి,సట్ల మురళి,శ్రీ శైలం,మూర్తి, రాళ్ళబండి శ్రీనివాస్, యాంసాని రాజు, చారి, భూర రమేష్, సమ్మయ్య గౌడ్ ,సారంగపాణి, బుర్ర రమేష్ బత్తల మల్లేషం,రాంముర్తి, తొ పాటు జిల్లాలోని 11 మండలాలకు చెందిన ఐజేయు నాయకులు,జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!