క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.

MLA G.Madhusudan Reddy

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో ప్రేమ్ కుమార్, సంపత్ కుమార్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు..శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని తెలిపారు, క్రీడాకారులు గెలుపు, ఓటములను క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!