MLA Bandi Laxma Reddy Felicitates Group-1 Winner Sabitha
*గ్రూప్ 1 విజేతను సన్మానించిన ఎమ్మెల్యే
కాప్రా నేటిధాత్రి
చర్లపల్లి డివిజన్ పరిధిలోని చక్రీపురం నాగార్జున కాలనీ కి చెందిన దరవత్ సబితా ఇటీవల విడుదల అయిన గ్రూప్ 1 ఫలితాల్లో 303 ర్యాంక్ సాధించి డి.ఎస్.పి గా ఎంపిక కావడం జరిగింది.
ఈ సందర్భగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వారి నివాసానికి (డాక్టర్ ఏ ఎస్ రావు నగర్) డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమ శేఖర్ రెడ్డి తో కలిసి వెళ్ళి వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి గ్రూప్ 1 ఫలితాల్లో డీ ఎస్ పి గా నియమితులైన సబితా ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి అని ఈమె విజయం బంజారా జాతి కే గర్వకారణం అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమ శేఖర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
