
MLA Donthi
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలంలోని చంద్రయ్య పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ భాషబోయిన రవి, శ్రీనివాస్ ల తండ్రి భాషబోయిన ఐలయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా గురువారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా మృతుడు ఐలయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టి పి సి సి సభ్యులు పెండెం రామానంద్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, నర్సంపేట పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల మధు ముదిరాజ్, నర్సంపేట పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి,మట్ట రాజు, భాషబోయిన పాపయ్య, సల్పాల ప్రభాకర్, జగన్మోహన్ రావు,ఆదిరెడ్డి, ఓర్సు తిరుపతి,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.