నర్సంపేట,నేటిధాత్రి :
తెలంగాణ రైతు సంఘం ( ఏఐకెఎస్) వరంగల్ జిల్లా కమిటీ అధ్వర్యంలో 2024 సంవత్సరం క్యాలెండర్ మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వం దృష్టికి తేవాలని అలాగే రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొరబోయిన కుమారస్వామి , జిల్లా నాయకులు, నర్శింహరెడ్డి, శ్రీనివాస రెడ్డి, ఈశ్లవత్ నెహ్రూ, గొర్రె సంజీవ రెడ్డి, లింగాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.