నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మండలం నాగూర్లపల్లె గ్రామం నుండి పర్షనాయక్ తండ నారాయణ తండా వరకు ఆర్అండ్ బి ఎస్టి ఎస్డిఎఫ్ నిధులు 2 కోట్ల 50 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి శంకుస్థాపన శిలపలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అన్ని రకాల ప్రభుత్వ గ్రాంట్లను తెచ్చి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్, కౌన్సిలర్లు వేముల సాంబయ్య గౌడ్,బత్తిని రాజేందర్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.