MLA Distributes CMRF Cheques to Beneficiaries
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలొ గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుట్ల తిరుపతి ఆధ్వర్యంలో చిట్యాల టేకుమట్ల మండలంలోని సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పాల్గొనిపంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని అన్నారు అలాగే పేద ప్రజలు ఎవరైనా ఎలాంటి పైరవీలకు తావు లేకుండ స్వచ్ఛందంగా అమలు చేస్తామన్నారు ఎవరికి ఏ ఆపద ఉన్న స్వచ్ఛందంగా వచ్చి చెప్పుకోవాలన్నారు, ఇది ప్రజా పాలన ప్రభుత్వమని కొనియాడారు, 18 గంటలు కష్టపడి పని చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ నియోజకవర్గ ప్రజల కోసమే అహర్నిశల కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,జిల్లా కాంగ్రెస్అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బుర లక్ష్మణ్ గౌడ్ , జిల్లా నాయకులు చిలుకల రాయకొమురు, వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల అల్లకొండ కుమార్ టేకుమట్ల చిట్యాల మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు లబ్ధిదారులు పాల్గొన్నారు.
