హన్మకొండ, నేటిధాత్రి:
అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హనుమకొండలో ఉన్నటువంటి ప్రజ్ఞ అకాడమీ అధ్యాపకులను పరకాల ఎమ్మెల్యే శ్రీ చల్ల ధర్మారెడ్డి గారు సన్మానించారు ఈ సందర్భంగా చల్ల ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ సమాజంలో అత్యంత ప్రభావంతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని వారి సమాజానికి ఎనలేని సేవలను చేస్తూ సమాజ నిర్మాతలుగా ఉన్నందుకు అభినందిస్తున్నారని పేర్కొన్నారు
ప్రజ్ఞ అకాడమీ అధినేత ఓదెల చంద్రమౌళి మాట్లాడుతూ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల కంటే నిజాయితీగా నిస్వార్ధంగా పనిచేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని సమాజం యొక్క స్థితిగతులను సమాజాభివృద్ధిని ఆకాంక్షించేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే అని విద్యార్థులకు ఎన్నో విధాల సేవలు అందిస్తూ వారి యొక్క జీవితాలకు బంగారు బాటలు వేస్తున్నారు సమాజం యొక్క అభివృద్ధి కేవలం ఉపాధ్యాయునిపైనే ఆధారపడి ఉంటుందని మనుషుల తలరాతలు రాసేది ఆ భగవంతుడు అయితే సమాజం యొక్క రూపురేఖలను మార్చేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే. తల్లిదండ్రులు కేవలం వాళ్ల పిల్లల యొక్క భవిష్యత్తు గూర్చి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు కానీ ఉపాధ్యాయుడు తన విద్యార్థులందరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకే ప్రపంచంలో ఉన్న ఉపాధ్యాయులందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో అప్పాని రాజు మరియు ఎలికట్టె రవి ,ఓదెల రమేష్ లు పాల్గొన్నారు.