ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 30
మల్లాపూర్ డివిజన్ బి ఆర్ టి యు ఆటో యూనియన్ వారు ఈ రొజు ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి తో కలిసి, పర్యాటక శాఖ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ని , ఆటో యూనియన్ బి ఆర్ టి యు వారి సమస్యలను వివరించటం జరిగింది.
ఆటో కార్మికులు గత నెల రోజులుగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని
సంవత్సరానికి రూ.12 వేలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రోజుకు వెయ్యి రూపాయాల ఆదాయంపై గండికొట్టిందని ఆటోవాలాలు అన్నారు.
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తామని,ఆటో యూనియన్ బి ఆర్ టి యు వారి సమస్యలు పరిష్కరించేవిదంగా చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమం లో మల్లాపుర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ,మీర్పేట్ హెచ్ బి కాలనీ కార్పొరేటర్ ప్రభు దాస్,మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి,బొసాని పవన్ , కాప్రా డివిజన్ ప్రెసెడెంట్ రామాంజనేయులు,పి.రమేష్ ,బాలకృష్ణ ,శ్రీనివాస్ ,యు.రమేష్ ,సాయి కిరణ్ తదితరులు పాల్గోన్నారు ….