రోడ్లు విస్తరించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 27:
నగరంలోని 44, 43 డివిజన్ పరిధిలోని రోడ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శుక్రవారం ఉదయం పరిశీలించారు. ముఖ్యంగా 44వ డివిజన్ పరిధిలోని నర్శరీ వీధిని ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ఫ్లానింగ్ అధికారులతో కలిసి వీధి మొత్తం పరిశీలించారు. రోడ్డు ఆక్రమణలతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి వీధిలో లేకపోవడంతో ఇటీవల ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మహిళలు ఎమ్మెల్యే దృష్టి తీసుకు వచ్చారు. అలాగే డ్రైనీజీ సమస్యతో దుర్వాశనకు తోడు దోమల బెడద ఎక్కువుగా ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకి చెప్పారు. వర్షం పడితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.మరోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో విస్తరిస్తే తమ ఇళ్ళు దెబ్బతింటాయని నర్శరీ వీధి వాసులు ఎమ్మెల్యే కి తెలిపారు. నర్శరీ వీధిలో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణం కోసం 76 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్తరణ ఎలా చేయాలి అనేది ఇంజినీరింగ్, టౌన్ ఫ్లానింగ్ అధికారులతో చర్చిం నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగుండా రోడ్డు, డ్రైనేజి సమస్యను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. 43వ డివిజన్ లో డ్రైనీజి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పోరేటర్లు వరికుంట్ల నారాయణ, నరసింహాచ్చారి, నరేంద్ర, సికే రేవతి, శైలజ, దూది కుమారి, రాధ,రాజా రెడ్డి,మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్ ఈ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.