కాప్రా నేటిధాత్రి 13:
మల్లాపూర్ జిహెచ్ఎంసి గ్రౌండ్లో భోగి పండుగను పురస్కరించుకునీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రభుదాసులతో కలిసి గాలిపటాలు ఎగరవేశారు. అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని, పతంగులను ఎగిరే వేసేటప్పుడు చిన్నారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.