మిషన్ భగీరథ..
క్వాలిటీ కంట్రోల్ పై పర్యవేక్షణ.
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామాల్లో ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటిపై క్వాలిటీ కంట్రోల్ ఏఈ సుధాకర్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి పర్యవేక్షించారు. మండలంలోని నగరం తండా గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో గల మిషన్ భగీరథ నీటికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. వాటర్ ట్యాంకులు, ఇండ్లలోకి సరఫరా అయ్యే నీటిని పరిశీలించి వాటి నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మిషన్ భగీరథ హెల్పర్ పరశురాములు, బలిజ భాస్కర్, తదితరులు ఉన్నారు
