మంత్రి కేటీ రామారావు భారీ మెజార్టీతో గెలిపించాలి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం చిన్నా లింగాపూర్ గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో వాడవాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్ధి పథకాలే మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మళ్లీ వచ్చేది మన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ రాము మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేందర్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *