గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మంత్రుల అవినీతిని బట్టబయలు చేసిన మంత్రి కొండా సురేఖ
-మంత్రి వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి..సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
-బీసీ మహిళా మంత్రిపై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీ సమాజం
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
గత పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చేసిన అవినీతి చిట్టాను విప్పిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీలోని అగ్రకులస్తులు తప్పుగా వక్రీకరించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని, అట్టి కుట్రలను చూస్తూ బీసీ సమాజం ఊరుకోబోదని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఘాటుగా హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తి పడి..ప్రతి పనిలో వాటాలు తీసుకుని..ధనిక తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి వేశారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగాలన్నా, ఫైల్ కదలాలన్నా మంత్రులకు కమిషన్లు ఇస్తేనే పనులు జరిగేవని కాలేశ్వరం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లాంటి పథకాలలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తే.ఆ ఆరోపణలపై సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు..వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోని కొందరు అగ్రవర్ణ కులస్తులు మంత్రి కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని, బీసీ మంత్రిగా..ఓరుగల్లు ప్రజల ముద్దుబిడ్డగా.పేద ప్రజల గుండెచప్పుడుగా..నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యి..వారి హృదయాల్లో కొలువుదీరి.ప్రజా నాయకురాలిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గంలో చోటు సంపాదించుకొని.మిగతా మంత్రులను కలుపుకొని..సమిష్టి నిర్ణయాలతో ప్రజా పాలనను ముందుకు తీసుకెళుతున్న తరుణంలో.బీసీ మంత్రి అయినా కొండా సురేఖ ఎదుగుదలను ఓర్వలేక.ఆమెను టార్గెట్ చేసి.కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం మధ్య చిచ్చుపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీలోని అగ్ర కులస్తులు కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ.ప్రజా కోర్టులో బీఆర్ఎస్ పార్టీ అగ్రకులస్తుల వైఖరిని ఎండగడతామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.