పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు,సౌకర్యాలు కల్పించాలి,జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,

పోలింగ్ కేంద్రాలలో కనీస,మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. గురువారం రోజున ఐడిఓసీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ తో కలిసి జిల్లా అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 30 న జరుగనున్న శాసన సభ ఎన్నికల పోలింగ్ కు గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫ్యాన్, రెలింగ్ తి సహా ర్యాంపు లు, తదితర సౌకర్యాలు, వసతులు పరిశీలించి ఎలాంటి లోపాలు లేకుండా సదుపాయాలు కల్పించాలని అన్నారు. గ్రామాలలో పంచాయతీ, పట్టణాల్లో మునిసిపల్ వర్కర్ లతో ఏర్పాట్లు చేయించాలని అన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మునిసిపల్ కమీషనర్ లు, పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనులు పూర్తిచేసి పోలింగ్ నాటికి సిద్దం చేయాలని ఆదేశించారు. అలాగే మాడల్ పోలింగ్ కేంద్రాలు, మహిళా, యువత, దివ్యాంగుల కు ప్రత్యేకించిన పోలింగ్ కేంద్రాలలో వసతులతో పాటు అందంగా, అవసరమైన పనులు చేపట్టి తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, వివిధ శాఖల అధికారులు, తదితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!