చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు! ఉద్యోగులు వేధించుకు తింటున్నారు!!

-మిల్లర్లను వేదించొద్దన మంత్రి, కమీషనర్‌ ఆదేశాలు జారీ చేసినా పెడచెవిన పెడుతున్నారు.

-ఉద్యోగుల తీరుతో మిల్లర్లు ఆగమౌతున్నారు.

-పై స్థాయి అధికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు.

 

-ప్రభుత్వాన్ని ఉద్యోగులే అబాసుపాలు చేస్తున్నారు.

-మిల్లర్లకు ప్రభుత్వం మీద అపోహలకు కారకులౌతున్నారు.

-ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు.

-సన్న బియ్యం పథకాన్ని తూట్లు పొడిచేలా కుట్రలకు ఉద్యోగులే తెర తీస్తున్నారు.

-చిన్న మిల్లర్లకు వడ్లు కేటాయించకుండా నాటకాలాడుతున్నారు.

-మిల్లర్ల మీద లేనిపోనివి సృష్టించి, ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొడుతున్నారు.

-లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు.

-అడిగినంత ఇవ్వలేని చిన్న మిల్లర్లకు ఉద్యోగులు నరకం చూపిస్తున్నారు.

-ఉద్యోగుల తీరుతో మిల్లర్లు నష్టాల బారిన పడి అప్పుల పాలౌతున్నారు.

-అధికారులకు లంచాలివ్వలేక మిల్లర్లు నలిగిపోతున్నారు.

-కొత్తగా ఎవరైనా మిల్లులు ఏర్పాటు చేసుకోవాలంటే భయపడిపోతున్నారు.

-ఇండస్ట్రీస్‌ను కాపాడాల్సిన అధికారులు చిన్న మిల్లర్లను చంపేస్తున్నారు.

-డిటి స్థాయి ఉద్యోగులు కూడా మిల్లర్లను అల్లాడిస్తున్నారు.

-ఒక రకంగా ఏడిపించుకు తింటున్నారు.

-కోట్ల రూపాయల అప్పులు చేసి మిల్లులు పెట్టుకుంటే వడ్లు కేటాయిండం లేదు.

-నెలనెల మిల్లర్లు లక్షల రూపాయలు అప్పులు చేసి బ్యాంకుల వడ్డీలు చెల్లించుకుంటున్నారు.

-ప్రభుత్వ ఆదేశాలను డిటి స్థాయి ఉద్యోగి కూడా లెక్క చేయడం లేదు.

-డిఎం, డిఎస్‌ఓ, డిటిలు అక్రమాలకు బాగా అలవాటు పడ్డారు.

-అన్యాయాలకు తెగబడుతున్నారు.

-మిల్లర్లకంటే మించిన ఆస్థులు సంపాదించుకుంటున్నారు.

-దశాబ్దాల తరబడి ట్రాన్స్‌ ఫర్లు లేకుండా తిష్ట వేసుకుని కూర్చున్నారు.

-ఏసిబి, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాడులు చేస్తే సివిల్‌ సప్లయ్‌ ఉద్యోగుల బండారం మొత్తం బైటపడుతుంది.

-అవినీతికి అలవాటు పడి మిల్లర్లను పీడిరచే వారి పీడ పోతుంది.

-జిల్లాల వారిగా డిఎం, డిఎస్‌ఓ, డిటిల అక్రమాలు, ఆస్తులపై త్వరలో వరుస కథనాలు మీ ‘‘నేటిధాత్రి’’ లో..

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేవుడు వరమిచ్చినా పూజారి కరునించడం లేదన్నట్లు వుంది సివిల్‌ సప్లైశాఖలోని జిల్లా స్దాయి ఉద్యోగుల సంగతి. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు మిల్లర్లను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ఎంత చెప్పినా జిల్లా స్ధాయి ఉద్యోగులు పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. వారి ఆగడాలు ఆపడం లేదు. వారి దోపిడీ ఆడగం లేదు. ఆ శాఖ కమీషనర్‌ ఆదేశాలు కూడా జిల్లాల అధికారులు బేఖాతరు చేస్తున్నారు. పొరపాటున రైస్‌ మిల్లర్లు కమీషనర్‌ ఇచ్చిన ఆదేశాల గురించి ప్రస్తావిస్తే ఏకంగా ఆయన్నే వచ్చి వడ్లు కొనుగోలు చేసుకొమ్మని చెప్పమని బిరుసు సమాదానాలిస్తున్నారట. వడ్లు ఆయననే కేటాయించమని అడగండి అంటూ మిల్లర్లను హేళనగా మాట్లాడుతున్నారట. అంత బలుపు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు ఎదురు చెప్పలేక, వారి చెప్పిందానికల్లా తలూపలేక, అడినంత సొమ్ము ముట్ట చెప్పలేక రైస్‌ మిల్లర్లు విలవిలలాడిపోతున్నారు. అటు మిల్లులు నడవక, ఇటు ఉద్యోగులు అడిగినంత ముట్ట జెప్పలేక మిల్లులు మూసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని మధనపడుతున్నారు. జిల్లాల్లో డిటి నుంచి మొదలు, డిఎం వరకు వున్న ఉద్యోగుల మూలంగా చిన్న రైస్‌ మిల్లర్లు చితికిపోతున్నారు. వేదించుకు తింటున్న ఉద్యోగులను తట్టుకోలేకపోతున్నారు. లక్షలకు లక్షలు డిమాండ్‌ చేస్తుంటే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. ఐదు లారీల వడ్లు కేటాయించడం కోసం రూ.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ఐదు లారీల వడ్లను బియ్యంగా మార్చి అమ్మితే వచ్చే లాభమే లక్ష అయితే, ఉద్యోగులకు రూ.5లక్షలు ఎలా చెల్లించలేక మిల్లులు మూసుకుంటున్నారు. ఇంతటి దుర్మార్గానికి ఉద్యోగులు పాల్పడుతున్నా పై స్ధాయి అదికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలు కమీషనర్‌ వరకు చేరకపోతున్నాయి. కొంత మంది మిల్లర్ల అసోసియేషన్‌ ముఖ్యలు కూడా చిన్న మిల్లర్లను ఇబ్బందులు పెట్టాలనే చూస్తున్నారు. ఉద్యోగుల చేత వారిని మిల్లర్‌ సంఘాల ముఖ్యులు కూడా ఉద్యోగులకు సహకరిస్తున్నారు. నిజానికి మిల్లర్లకు సమస్యలొస్తే సహకరించాల్సిన మిల్లర్ల అసోసియేషన్‌ ఉద్యోగులతో లోపాయి కారి ఒప్పందాలతో చిన్న మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సన్న బియ్యం పధకం అమలు చేస్తోంది. దాని విజయవంతం చేయడం కోసం ప్రభుత్వం కొంత ఉదారమైన విధానాలు అవలంబించాలని చూస్తోంది. పైగా సన్న బియ్యం పధకం దిగ్విజయంగా సాగాలన్న లక్ష్యంత కమీషనర్‌ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. చిన్న మిర్లర్లు కోటి ఆపైన వున్న బకాయిలపై ఉద్యోగులు ఒత్తిడి చేయొద్దని, వారికి వడ్లు కేటాయించడంలో సమస్యలు సృష్టించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్దాయి ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లలో ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయినా జిల్లా స్ధాయి ఉద్యోగులు అటు ప్రభుత్వం, ఇటు కమీషనర్‌ మాట కూడా లెక్క చేయడం లేదు. దాంతో చిన్న మిల్లర్లు ఆగమైపోతున్నారు. రాష్ట్ర స్దాయి అదికారుల కళ్లు గప్పి అక్రమాలకు తెగబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సివిల్‌ సప్లై శాఖ జిల్లా స్దాయి అదికారులు అబాసు పాలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మిల్లర్లు నిందించేలా కొన్ని జిల్లాల సివిల్‌ సప్లై ఉద్యోగులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అనేకం వెల్లువెత్తుతున్నాయి. చిన్న మిల్లర్లను ఎట్టి పరిస్దితుల్లో ఇబ్బందులకు గురి చేయొద్దని ఇప్పటికే కమీషనర్‌ పలు మార్లు హెచ్చరించారు. మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిలు వుండడమే కాదు, ప్రభుత్వం కూడా మిల్లర్లకు బకాయిలు వున్న మాట వాస్తవం. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో కోటిన్నర వరకు బకాయిలు వున్న ఏ మిల్లర్‌ను సమస్యలు సృష్టించొద్దని సూచించారు. అంతే కాకుండా ఆపై కూడా బకాయిలు వున్న మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా అండర్‌ టేకింగ్‌ లెటర్లు తీసుకొనైనా వడ్లు కేటాయించాలని చెప్పినా ఉద్యోగులు వినడం లేదు. వాళ్ల వద్ద అలాంటివేమీ అవసరం లేదు. మాకెంతిస్తావన్న బేరాలు తప్ప ప్రభుత్వ ఆదేశాలను ఉద్యోగులు పట్టించుకోవడం లేదు. మిల్లర్లకువేధింపులు ఆపడం లేదు. మిల్లర్లకు సహరించి, ప్రబుత్వ లక్ష్యాలిను నెరవేర్చాల్సిన బాధ్యత కలిగిన ఉద్యోగులు తమ స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తున్నారని చెప్పడానికి ఇంత కన్నా నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ ఒక సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం వుంది. వరంగల్‌ జిల్లాలో ఓ వ్యక్తి కొత్తగా ఒక మిల్లులను ఏర్పాటు చేసుకున్నాడు. సుమారు 12 కోట్ల రూపాయల వరకు బ్యాంకు రుణం తెచ్చుకొని 9 నెలల క్రితం మిల్లు నిర్మాణం, మిషన్‌ ఏర్పాటు అన్ని పనులు పూర్తి చేసుకున్నారు. ఇక మిల్లు నడిచేందుకు అవసరమైన వడ్ల పర్మిషన్‌ కోసం సివిల్‌సప్లై శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిది నెలల క్రితం పెట్టిన ధరఖాస్తు ఇంత వరకు ఆన్‌ లైన్‌ లో కూడా నమోదుచేయలేదు. ఆ ఫైల్‌ డిటి నుంచి పై అధికారి వరకు వెళ్లలేదు. తొమ్మిది నెలలుగా ఆ మిల్లర్‌ను తిప్పించుకుంటున్నారు. అతన్ని పిండాల్సినంత పిండేశారు. కాని ఫైల్‌ను పక్క టేబుల్‌కు కూడా కదల్చలేదు. అప్పటి నుంచి ఫైల్‌ గురించి డిటిని అడిగితే డిఎస్‌ఓ వద్ద వుందంటారు. డిఎస్‌ఓను అడిగే డిఎం.దగ్గరుందంటారు. డిఎంని అడిగితే కమీషనర్‌ కార్యాలయానికి చేరిందంటారు. ఇదిగో అదిగో అంటూ మిల్లర్‌ వద్ద నుంచి నొక్కేసేది నొక్కేస్తూనే వున్నారు. కాని ఆయన పని మాత్రం చేయలేదు. నెలకు రూ.9లక్షల రూపాయలు బ్యాంకు వడ్డీలు చెల్లిస్తూ, శాఖ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా తెలిసిందేమిటంటే అసలు ఆఫైల్‌ డిటీ టేబుల్‌ నుంచి కదల్లెదు. కనీసం ఆన్‌లైన్‌లో కూడా పెట్టలేదు. అంటే ఉద్యోగుల నిర్లక్ష్యం, అలసత్వం ఎలా వున్నాయో అర్ధం కావడం లేదు. ఈ విషయాన్ని ఆ మిల్లర్‌ పై స్ధాయి అదికారుల దృష్టికి తీసుకెళ్లి, అక్కడి నుంచి ఫోన్‌ చేయిస్తే సదరు వ్యక్తి మీద కక్ష కట్టినంత పనిచేస్తున్నారు. పై స్దాయి అదికారి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించినా కిందిస్దాయి డిటీ, డిఎస్‌ఓలు కనీసం భయపడడం లేదంటే ఎలా తయారయ్యారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తిన్నది కాదని, మళ్లీ ఎంతిస్తావంటూ లెక్కలు చెబుతున్నారంటే ఉద్యోగులు అవినీతి ఏ స్ధాయికి చేరుకున్నదో తెలిసిపోతోంది. అంతే కాదు పై స్ధాయి నుంచి ఫోన్‌ రాగానే ఆన్‌లైన్‌ చేయాలా..మరో పది రోజులు తిప్పించుకుందాంలే..అంటూ ఆ వ్యక్తి ముందే ఉద్యోగులు మాట్లాడుకోవడం అంటే ఉద్యోగం పోతుందన్న భయం కించిత్‌ కూడా లేదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆ ఉద్యోగులు ఎలాంటి ట్రాన్స్‌ఫర్లు లేకుండా పాతుకుపోయారు. మిల్లర్ల ఇచ్చే లక్షలకు బాగా అలవాటు పడ్డారు. మిల్లర్లను బెదిరించి వసూలు చేసే ఆదాయం కోట్లలో పేరుకుపోయింది. ఉద్యోగమంటే లెక్కలేకపోతోందని అంటున్నారు. ఉద్యోగులు తిరుపతి వెళ్లాలన్నా, అక్కడ వసతులు ఏర్పాటుకు అయ్యే ఖర్చులన్నీ మిల్లర్లే భరించాలి. ఇక ఎంజాయ్‌ మెంటు కోసం గోవా లాంటి విహర యాత్రలు ఉద్యోగులు చేయాలంటే కూడా మిల్లర్లు ఆ ఖర్చు భరించాల్సిందే అన్నంత దోపిడీ జరుగుతోంది. ఇదంతా భహిరంగ రహస్యమే అయినా మిల్లర్లను వేదించకుండా వుండలేదు. పెద్ద పెద్ద మిలర్లు, యూనియన్‌ ప్రతినిధులకు వడ్లు కేటాయించడం కోసం చిన్న చిన్న మిల్లర్లను లేకుండా చేయడం కోసం ఉద్యోగులు పని గట్టుకొని వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలున్నాయి. మిల్లర్‌ ఇండస్ట్రీ మరింత పెరిగేందుకు కృషి చేయాల్సిన ఉద్యోగులు ఆ వ్యవస్ధలో పెద్దల కోసం చిన్న చిన్న మిల్లులే లేకుండా చేయడం అంటే ప్రభుత్వ లక్ష్యాలకు గండి కొట్టడమే అవుతుంది. పెద్ద మిల్లర్ల కోసం చిన్న మిల్లర్లను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు మిల్లర్లను మించిన సంపాదన పరులుగా మారిపోయారు. దశాబ్ధాల తరబడి ఒకే కార్యాలయంలో పనిచేస్తుండడంతో మిల్లర్లను వేధించడం ఎంతో సులువైపోతోంది. డిఎం స్ధాయి నుంచి డిఎస్‌ఓ, డిటిలు అక్రమాలకు బాగా అలవాటు పడిపోయారు. కోట్లుకు కోట్లు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిపై ఏసిబి, ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు దాడులు చేస్తే వారి బండారం మొత్తం బైట పడుతుంది. అలా అవినీతికి అలవాటు పడి మిల్లర్లను పీడిస్తున్న ఉద్యోగులపై జిల్లాల వారిగా వరుస కధనాలు త్వరలో …మీ నేటిధాత్రిలో వరుసగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!