`దొంగ మిల్లర్ జగన్ ‘‘బడివె’’ మాటలు!
`నా మిల్లులను టచ్ చేసే దమ్ముందా!
`అందరూ నా సొమ్ము తిన్నోళ్లే!
`ఎవడొస్తాడో రాని చూస్తా!
`500000 వడ్ల బస్తాలు లెక్కకున్నాయా?
`28 వేల బస్తాలల్లో 2000 పైచిలుకు బస్తాలు మాయం! మరి 500000 బస్తాలలో ఎన్ని బస్తాలు మాయం చేసినట్లు!
`ఆ రెండు మిల్లులకు కేటాయించిన 500000 బస్తాల లెక్కలు తేల్చండి!
`జగన్ బండారం బైట పెట్టండి.
`రైతులను మోసం చేసిన మిల్లులను మూసేయండి!
`అధికారులు, నా సొమ్ము తిన్న వాళ్లకు అంత ధైర్యముందా? అని సవాలు విసురుతున్నాడు.
`హనుమకొండ ‘‘జెసి’’ కోరిన రిపోర్ట్పై ఇప్పటివరకు స్పందించని, డీఎస్ఓ కొమురయ్య,సూపరిండెంట్ రోజారాణి,డిటి నాగేంద్ర ప్రసాద్..
`వరంగల్ మిల్లర్ల అవినీతిపై ఖమ్మం జెసి సివిల్ సప్లై కమిషనర్ కి సమర్పించిన ఆధారాలు.
`ఆ మహిళా అధికారికి గుణం కన్నా కులమే ముఖ్యమట?
`మిల్లర్ జగన్ను కాపాడే తీరుతుందట?
`హనుమకొండ అధికారుల తీరుపై విస్తుపోతున్న ఖమ్మం అధికారులు.
`తనపై చర్యలు తీసుకుంటే అందరి గుట్టు బయట పెడతానంటున్న జగన్.
`జగన్ మిల్లుల్లో ఉన్న లక్షల వడ్ల బస్తాలని ఇతర మిల్లులకు తరలించాలని ఖమ్మం జేసి. ఆదేశాలు.
`అధికారులను అమ్మనా బూతులు తిడుతున్న జగన్?
`ఆ విషయం తెలిసినా చీమ కుట్టినట్లు కూడా లేని అధికారులు?
`ఖమ్మం జేసి ఎంక్వౌరీకి ఆదేశించి 15 రోజులకొస్తోంది?
`ఇంత వరకు హనుమకొండ ‘‘జెసి’’ కి ట్రక్ షీట్లు కూడా అందించని అధికారులు.
`5 లక్షల బస్తాల లెక్కలెప్పుడు తేల్చుతారు! జగన్ బండారం ఎప్పుడు బైట పెడతారు!
`జగన్ అక్రమ సంపాదన ఎప్పుడు వెలికితీస్తారు?
`రైతులకు న్యాయం ఎప్పుడు చేస్తారు?
`ఒక్క ఐకేపి సెంటర్ నుంచి వచ్చిన వడ్లతోనే రూ.20 లక్షల మోసం చేసిన జగన్?
`20 ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో ఎంత మాయం చేసి వుంటారు?
`ఎన్ని కోట్లు వెనకేసుకొని వుంటాడు?
`అంతా బహిరంగ రహస్యమే అయినా అధికారులంతా గప్ చుప్.
హైదరాబాద్,నేటిధాత్రి:
తవ్వుతున్నా కొద్ది హన్మకొండలోని ఓ అక్రమ మిల్లర్ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హన్మకొండ జిల్లా సివిల్ సప్లై అధికారుల అండదండలతో విచ్చలవిడిగా ఆ అక్రమ మిల్లర్ సాగిస్తున్న అక్రమ దందాలన్నీ వెలుగు చూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన మిల్లర్ బాగోతాలపై నేటి దాత్రి వరుస కథనాలు ప్రచురిస్తూనేవుంది. ఆ వార్తలు వాస్తవాలను అంగీకరిస్తూ ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ హన్మకొండ అదికారులకు సూచిస్తూ నోట్ కూడా పంపించారు. ఆ నోట్ హన్మకొండ జిల్లా అధికారులకు చేరి కూడా సుమారు 15 రోజులౌతోంది. అయినా హన్మకొండ జిల్లా యంత్రాంగం కదిలింది లేదు. ఉలుకు లేదు. పలుకులేదు. పైగా అక్రమ మిల్లర్కు జగన్కు వంతపాడుతున్నారు. అండగా వుంటున్నారు. అతనికి తప్పించుకునేందుకు సూచనలు,సలహాలు ఇస్తున్నారు. ఆఖరుకు ఖమ్మం జిల్లా జేసినే బురిడీ కొట్టించాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అంటే జగన్ వద్ద నుంచి లెక్కలేనంతసొమ్ము అదికారులు ఎప్పటికప్పుడు అందుకున్నారు. జగన్తో లాలూచీ పడ్డారు. అందుకే జగన్ ఇటీవల ఓ ఫంక్షన్లో అధికారులపై బూతులు సందించినట్లు కూడా విశ్వసనీయ సమచారం. ఆ ఫంక్షన్లో జగన్ మీద వస్తున్న ఆరోపణలపై చర్చకు వచ్చినప్పుడు ఎవడైతే నాకేంటి? ఎవడొచ్చి నన్ను ఏం చేస్తారు? అంతా నా గుప్పిట్లో వున్నారు. నా చేతిలో వున్నారు. నేను చెప్పింది మాత్రమే వాళ్లు వినాలి. లేకుంటే ఏం జరుగుతుందో వాళ్లకు కూడా తెలుసు. అంటూ అదికారులన్న మర్యాద కూడా లేకుండా బూతులు సందిస్తూ ఆ ఫంక్షన్లో జగన్ హంగామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం. నన్ను..నా మిల్లును టచ్ చేసే దమ్ము ఎవరికి వుంది? నా మిల్లు దగ్గరకు వచ్చిన మాట్లే ధైర్యం వాళ్లకు వుందా? అంటూ సవాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి, కింది నుంచి పై స్దాయి దాక అందరూ నా సొమ్ము తిన్నవాళ్లే..నేను వేసే బిస్కట్లకు ఆశపడేవారే..అలాంటి వాళ్లు నా జోలికి వస్తారా? సివిల్ సప్లైకి చెందిన విజిలెన్స్ అయినా, ఎవరైనా సరే నా మిల్లుల కాంపౌండ్లోకి రాలేరు. ఎవడొస్తారో..రాని చూస్తా? అంటూ జగన్ అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు జగన్కు కేవలం 28వేల బస్తాల వడ్లే వచ్చినట్లు అనుకుంటున్నారు. కాని నిజానికి 2024`25 తొలి సీజన్లోనే సుమారు 5లక్షల వడ్ల బస్తాలు వచ్చినట్లు తెలుస్తోంది. అవన్నీ ఖమ్మం జిల్లాలకు చెందిన వడ్లు కావడం విశేషం. ఎందుకంటే హన్మకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రైతులు ఎవరూ మిల్లర్ జగన్కు వడ్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. ఒక వేళ ఇచ్చినా ముందు మురిపెంగా మాట్లాడే జగన్ తర్వాత ఎంత కోతలు కోస్తాడో..రైతులను ఎంత ముంచేస్తాడో అందరకీ తెలుసు. అందుకే జగన్ మిల్లులకు ఏ ఒక్క ఐకేపి సెంటర్ నుంచి కూడా జగన్కు వడ్లు ఇవ్వడానికి రైతులు అసలే ఒప్పుకోరు. అందుకే మిల్లర్ జగన్ ఖమ్మం జిల్లాకు చెందిన ఐకేపి సెంటర్ల నుంచి వడ్లు తెచ్చుకుంటాడు. ఖమ్మం జిల్లాకుచెందిన ఒక్క ఐకేపి సెంటర్ నుంచి వచ్చిన 28వేల బస్తాలలో సుమారు 2వేల బస్తాలు మాయం చేసినట్లు ఆరోపలు ఎదుర్కొంటున్నారు. అది నిజమే అని ఖమ్మం జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్ నిర్దారణ చేశారు. ఆ బస్తాలు ఏమయ్యాయో? వెంటనే రిపోర్టు కావాలని కోరిన సందర్భం కూడా వుంది. అయినా హన్మకొండ జిల్లా అధికారులు ఇప్పటి వరకు కదల్లేదు. అయితే జగన్ అక్రమ దందాలపై నేటిధాత్రి మరింత దృష్టిపెట్టడంతో ఖమ్మం జిల్లాలోని సుమారు 20 ఐకేపి సెంటర్ల నుంచి ఇప్పటి వరకు 5లక్షల వడ్ల బస్తాలు జగన్ మిల్లులకు చేరినట్లు సమాచారం. 28వేల బస్తాలతోనే సుమారు 2వేల బస్తాలు మాయం చేసిన జగన్, 5లక్షల బస్తాలలో ఎంత మాయి చేసి వుంటాడో అర్ధం చేసుకోవచ్చు. 28వేల బస్తాలలో మాయం చేసిన 2వేల బస్తాల మూలంగా జగన్ 20లక్షల రూపాయలు రైతులను మోసం చేశాడు. అంటే 5లక్షల వడ్ల బస్తాలలో జరిగిన మాయంతో ఎన్ని కోట్లు కొట్టేశాడన్నది ఇప్పుడు లెక్క తేలాల్సి వుంది. ఇలా జగన్ చేస్తున్న మోసాలన్నీ హన్మకొండ జిల్లాకు చెందిన ఇతర మిల్లులకు, రైతులకు పూర్తిగా తెలుసు. అయినా ఎవరూ మాట్లాడానికి ముందుకు వచ్చేవారు కాదు. జగన్ అరచకాలు అలా వుండేవి. గత ప్రభుత్వ హాయాంలో కులం పేరు చెప్పుకొని ప్రాపకం పొందేవాడు. ఇప్పటికి కూడా అదే సాగిస్తునాన్నాడు. ఆనాటి నుంచి జగన్ కనుసన్నల్లో వున్న అధికారులే ఇప్పటికీ వుండడంతో ఆయన ఆటలకు అడ్డు కట్ట పడడం లేదు. జగన్ మోసాలను ఎవరూ బైట పెట్టడం లేదు. పైగా జగన్ను వెనకేసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఖమ్మం జేసిని బురిడీకొట్టించాలని చాల ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి చేసిన స్కెచ్ జగన్, హన్మకొండ అదికారులు పసిగట్టకపోవడంతో అసలు బండారం బైట పడిరది. అయితే రెండు వేల బస్తాలకు సంబందిచిన సొమ్ము అందడంతో కాస్త ఆలస్యమైంది. అందుకు సంబంధించినవి గుర్తించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించిన సొమ్ము రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పమని జగన్కు హన్మకొండ అదికారులు సూచనలు చేస్తున్నట్లు కూడా సమాచారం. అంటే ఇంత జరుగుతున్నా జగన్ది అక్రమమని అనేందుకు కూడా హన్మకొండ అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. పైగా ఖమ్మం జేసి రిపోర్టునే తొందరపాటు చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొత్తం ఖమ్మం జిల్లా నుంచి జగన్కు చెందిన రెండుమిల్లలకు ఎన్ని బస్తాల వడ్లు చేరాయో లెక్కలు తేల్చే పనిలో ఖమ్మం జిల్లా అదికారులు నిమగ్నమైవున్నారు. ఇప్పటి వరకు అందినసమాచారం మేరకు జగన్కు చెందిన మిల్లులకు ఇప్పటికే 5లక్షల బస్తాలు చేరినట్లు ప్రాధమిక సమచారం. ఇంకా లోతుగా తవ్వితే ఎంత చేరిందనేదానిపైకూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం వుంది. జగన్కు ఇప్పుడు అసలైన భయం మొదలైంది. హన్మకొండ అదికారులను గుప్పిట్లోపెట్టుకొని ఆడినట్లే ఖమ్మం జిల్లా అధికారులను కూడా కొనేయాలనిచూశాడు. కాని కుదరలేదు. ఖమ్మం జేసి నిక్కచ్చిగా తన నిజాయితీని నిరూపించుకున్నారు. జరిగిన అక్రమ దందాలన్నీ బైట పెట్టాలనే చూస్తున్నారు. జగన్ వల్ల రైతులు ఎంతో మోసపోయారని గుర్తించారు. ఆ సొమ్ముంతా రైతులకు చేరేలా చూడాలనుకుంటున్నారు. అయితే ఇటు ఖమ్మం జిల్లా అధికారుల నుంచి ఒత్తిడి, కమీషనర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే హన్మకొండ అధికారులు కూడా రంగంలోకి దిగక తప్పదు. జగన్ బండారం బైట పెట్టక తప్పదు. ఎందుకంటే అప్పుడు వారి ఉద్యోగాలకే ఎసరు వస్తుంది. అలాంటి పరిస్ధితి వస్తే జగన్ను దోషిని చేయడం ఖాయం. కాకపోతే హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్న ఓ మహిళా అదికారి జగన్కుచెందిన సమాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. దాంతో జగన్ను కాపాడే బాద్యత ఆమె భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ అదికారికి జగన్ గుణం, వ్యవహారం, అక్రమ దందాలకన్నా, మోసాలకన్నా కులమే ముఖ్యమట? జగన్కు కాపాడి తీరుతుందట? ఈ విషయాన్ని ఆమె కార్యాలయంలో ఇతర ఉద్యోగులతో బాహంటానే చెబుతున్నారట? హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్ సప్లయ్ అదికారుల తీరుతో ఖమ్మం జిల్లా అదికారులు విస్తుపోతున్నారు. ఇదేం పద్దతని తప్పుపడుతున్నారు. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు మిల్లర్లకు మేలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారట? రోజు రోజుకూ మితిమీరిపోతున్న జగన్ వ్యాఖ్యలు తెలిసిన ఖమ్మం జేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. జగన్కు చెందిన మిల్లుల్లో ఖమ్మం జిల్లా రైతులకు చెందిన 5లక్షల వడ్ల బాస్తాలున్నాయా? లేవా? వుంటే లెక్కంత? ఎన్ని మాయమయ్యాయి? ఎలా మయ్యామయ్యాయి? అనే వివరాలు కావాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా యదావిధిగా ఇతర మిల్లులకు చెందిన వడ్ల ఖమ్మం వడ్ల లెక్కలో కలపడమో? లేక ఇతర మిల్లుల గోడౌన్లలో వున్న వడ్లు జగన్వి అని తేల్చితే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా తేల్చి చెప్పారట. దాంతో ఇంత దూరం వచ్చేదాకా అదికారులు ఏం చేస్తున్నారు? తానిచ్చిన సొమ్ములు తిని, తనకు అన్యాయం జరిగే పరిస్ధితి వచ్చేదాకా అదికారులు నిద్ర పోతున్నారా? అంటూ జగన్ అదికారుల మీద కూడా చిందులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అదికారులు కదులుతారా? లేక జగన్కే వత్తాసు పలుకుతారా? కోట్లలో రైతులను ముంచేస్తున్న జగన్పై చర్యలు తీసుకుంటారా? వేచి చూడాలి.