ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
కరోనాకాలం నుంచి ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్న ప్రధాని మోదీ
కృతజ్ఞతలు తెలిపిన ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు ప్రణయ్
నేటి ధాత్రి అయినవోలు :-
మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసిన సందర్భంగా భాజాపాయనవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్షాకాల దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు నెలల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి చేయడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా పార్టీ ఐనవోలు మండల పార్టీ అధ్యక్షులు మాదాసు ప్రణయ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి నాయకులు మరియు రేషన్ బియ్యం తీసుకున్న పేద మహిళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. కరోనాకాలం నుండి దాదాపు నాలుగు ఏళ్లుగా ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలికారు, మోడీజీ పేదల సంక్షేమం కోసం నిరంతరం పేదల పక్షపాతిగా అనిపించుకుంటున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పొన్నాల రాజు, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కోట కిరణ్ కుమార్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు తాటికాయల ఆనందం, పోలింగ్ బూత్ అధ్యక్షులు కట్కూరి రమేష్, మాదాసు వేణు, కట్ట విజయ్, మహేష్, లెనిన్, శివమణి, తదితరులు పాల్గొన్నారు