ఘనంగా మిలాద్ ఉన్ నబి వేడుకలు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని జామ మసీదు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పురవీధులు గుండా, ప్రధాన చౌరస్తాల మీదుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. భక్తి గీతాలను ఆలపిస్తూ పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ అఫ్జల్ లాడెన్, షేక్ షఫీ, మహమ్మద్ తాజుద్దీన్, సేవత్, ఖలీమ్, గౌస్, రెహమద్, ముజాహిద్, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
