Migrant Labourers Return Home After Sugarcane Work
బతుకు.. బండి..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా లోని నారాయణఖేడ్,కంగ్జి, వాసర, మనూర్ మండలాల నుంచి జహీరాబాద్ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్ కల్, కోహిర్, మొగుడంపల్లి, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెరుకు తరలింపు పనుల కోసం నాలుగు నెలల క్రితం వలస వచ్చారు. చెరుకు పనులు ముగియడంతో ఎడ్లబండ్లపై తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. గురువారం ఉదయం ఝరాసంగం మండలం మాచ్నూర్ నుంచి బర్దిపూర్కు వెళ్లే నిన్జ్ రహదారిపై ఎడ్లబండ్లపై కూలీలు వెళ్తుండటం కనిపించింది. “దిశ” వారిని పలకరించగా, నవంబర్ నెలలో కాంగ్జి నుంచి చెరుకు పనుల నిమిత్తం వచ్చామని, ప్రస్తుతం పనులు ముగియడంతో తిరిగి తమ గ్రామాలకు వెళ్తున్నామని తెలిపారు.
