
Government
మరిగడ్డ ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం చేయడానికి పిల్లలకు 140 ప్లేట్ల వితరణ.
చందుర్తి, నేటిధాత్రి:
మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు సిద్దిపేటకు చెందిన అయిత పురుషోత్తము , కొమురవెల్లి విద్యాసాగర్లు విద్యార్థులు మధ్యాహ్న భోజనము చేయుటకు 140 ప్లేట్లు వితరణ చేశారు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, తమ వంతు చేయుతగా ప్లేట్లు అందించామని , విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దాతలు విద్యర్థులను కోరారు.
విద్యార్థుల సౌకర్యార్ధం ప్లేట్లను అందించిన పురుషోత్తం, విద్యాసాగర్లను మండల విద్యాధికారి వినయ్ కుమార్ సన్మానించి,అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వేణుగోపాల్, కనకయ్య, జ్యోతిరాణి, సావిత్రి, సరోజ, పద్మ , విద్యార్థులు పాల్గొన్నారు.