"Residents Seek Basic Amenities"
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మీటర్లు మంజూరు చేయాలి
…మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రాయికల్, సెప్టెంబర్ 24, నేటి ధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరి లబ్ధిదారుల ఇంటి నిర్మాణానికి విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.బుధవారం రాయికల్ పట్టణం పర్యటనలో భాగంగా ఇందిరమ్మ లబ్ధిదారులు తాము ఇంటి నిర్మాణం చేపడుతున్నామని విద్యుత్ మీటర్లకు దరఖాస్తు చేసుకోగా విద్యుత్ శాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని విద్యుత్ మీటర్ల మంజూరు చేయించాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాజీమంత్రి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సత్వరం స్పందించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంబంధిత జగిత్యాల జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారి సుదర్శనం,రాయికల్ విద్యుత్ శాఖ ఏఈ నవీన్ తో చరవాణిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల విద్యుత్ మీటర్ల సమస్యను అడిగి తెలుసుకున్నారు.నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు విద్యుత్ మీటర్ల మంజూరుకై నిబంధనలలో సడలింపుతో అర్హులైన వాళ్లకు విద్యుత్ మీటర్లు మంజూరు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, నాయకులు కొయ్యేడి మహిపాల్,బాపురపు నర్సయ్య,షాకీర్,బత్తిని భూమయ్య, దాసరి గంగాధర్,రాకేష్,సింగని రమేష్,రాజారెడ్డి,కొమ్ముల ఆదిరెడ్డి,ఏలేటి జలంధర్ రెడ్డి,కొత్తపెళ్లి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
