
government junior college
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐడీఎస్ఓ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి. కుమార్ మాట్లాడుతూ-కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని, టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.