చల్మెడ ను మర్యాదపూర్వకంగా కలిసిన రెడ్డి సంఘం సభ్యులు

వేములవాడ నేటి దాత్రి

బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును బుధవారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన రెడ్డి సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు. అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు రెడ్డి సంఘం సభ్యులు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చల్మెడకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. అనంతరం చల్మెడ మాట్లాడుతూ భవిష్యత్ లో రెడ్డి సంఘం సభ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఊరడీ ప్రవీణ్, సర్పంచ్ ఊరడీ రామ్ రెడ్డి, నాయకులు మెడికల్ రాజిరెడ్డి, కట్ట తిరుపతి, కాసర్ల అరుణ్ కుమార్, వంకాయల భూమయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్, తాడేం లచ్చయ్య, రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎల్లా రామ్ రెడ్డి, మహేందర్, సురేష్ రెడ్డి, శ్రీనివాస్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *