బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన రంగపూర్ గ్రామ అంబేద్కర్ సంఘం సభ్యులు

వేములవాడ నేటి ధాత్రి

రాజన్న సిరిసిల్లా జిల్లా
భీమారం మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన అంబేద్కర్ (మాదిగ) సంఘం సభ్యులు బుధవారం బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సంఘ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తీర్మాన పత్రాన్ని చల్మెడకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ దళితులకు చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరామని, రాబోయే రోజుల్లో లక్ష్మీనరసింహారావు గెలుపు కొరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంగడి ఆనంద్ కుమార్, దళిత సంఘ నాయకులు బంగారు దీపక్, స్థానిక సంఘ సభ్యులు, కుమారస్వామి, గంగరాజు, ప్రసాద్, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *