
Fisheries Industrial Estate
మొక్కలు నాటిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు
నర్సంపేట,నేటిధాత్రి:
వన మహోత్సవంలో భాగంగా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మొక్కలు నాటారు.ఈ సందర్భంగా అధ్యక్షులు అల్లే రాజు మాట్లాడుతూ వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎఫ్డీఓ నాగమణి ఆదేశాల మేరకు కుల సంఘం ఆవరణలో, పెద్దమ్మగుడి వద్ద పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటినట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఫీల్డ్ ఆఫీసర్ హరీష్,ముదిరాజ్ కుల పెద్దమనిషి అల్లే పైడి కార్యదర్శి పెండ్యాల రవి,
కమ్మపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నంబర్ మేకల రాజు,మాజీ కుల పెద్దమనిషి పెండ్యాల బిక్షపతి, మాజీ సొసైటీ అధ్యక్షులు కుల పెద్దమనిషి పెండ్యాల మల్లేశం, మేకల రవి,అటెండర్ అల్లే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.