Golla Kuruma Association Donates CCTV Cameras
సీసీ కెమెరాల అందజేసినగొల్ల, కురుమ సంఘం సభ్యులు
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామానికి గొల్ల కురుమ సంఘం సభ్యులు సీసీ కెమెరా ను అందజేశారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన సంఘం సభ్యులు సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మా గౌడ్ కు సీసీ కెమెరా ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి దొంగతనాలు, గొడవలు జరిగిన సిసి కెమెరా ఆధారంగా పసిగట్టవచ్చన్నారు. అలాగే మిగతా సంఘాలు కూడా ముందుకు వచ్చి సహాయ పడవలసిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు
