తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డిని కలిసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు

భద్రాచలం నేటి ధాత్రి

చీఫ్ మినిస్టర్స్ కప్ 20 24 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ వద్ద నుంచి ప్రకాశం స్టేడియం వరకు జరిగిన టార్చ్ రిలే ప్రోగ్రాంకు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి జనరల్ సెక్రెటరీ జివి రామిరెడ్డి, మరియు సభ్యులుఈ కార్యక్రమంలో పాల్గొని శివసేన రెడ్డి తో మాట్లాడడం జరిగింది. అట్లానే టార్చ్ రిలే ప్రోగ్రాం లో జితేష్ వి పాటిల్ ని, జిల్లా ఎస్పీ ఐపీఎస్ రోహిత్ రాజు ని కలసి ఈ సందర్భంగా ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మత్తు పానీయాలు డ్రగ్స్ ఇటువంటి వాటికి యువత బానిసవుతున్నటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి క్రీడా రంగాన్ని ప్రోత్సహించినట్లయితే యువత చెడు మార్గం నుంచి క్రీడల ద్వారా ఫిట్నెస్ మరియు క్రీడా పరంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని భావించి సీఎం కప్ 20 24 ను ప్రారంభించడం జరిగిందనితెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!