ప్రశాంత్ భవన్ లో భోజనం, పండ్లు పంపిణీ చేసిన అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల గ్రామంలోని ప్రశాంత్ భవన్ లో గోపాలరావుపేట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఎపియల్ సీజన్ నాలుగు విజేతలుగా నిలిచిన జై భీమ్ (కార్తీక్) టీం విన్నర్ ప్రైజ్ మనీతో ప్రశాంత్ భవన్ లోని అనాధ పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు రేణికుంట అశోక్, విన్నర్ టీం కెప్టెన్ మడిపెల్లి కార్తీక్, క్రికెట్ టోర్నీ ఆర్గనైజర్స్ గంగాధర శ్రీకాంత్, దాసరి సంతు, సంఘ సభ్యులు లింగంపల్లి రవి, ఇందుర్తి ప్రవీణ్, సిపెల్లి సంపత్, రేణికుంట సతీష్, కొమ్ము దినేష్, సిపెల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *