హుజూర్ నగర్, నేటిధాత్రి.
సూర్యాపేట జిల్లా మెల్ల చెరువు మండల కేంద్రంలోని పంచాయితీ రాజ్ కార్యలయం వద్ద ఏసీబి దాడులు జరిగాయి. ఎంబి రికార్డు చేసేందుకు 5000 లంచం డిమాండ్ చేసిన మెల్ల చెరువు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. కప్పల కుంట తండాకు చెందిన ధరావత్ కృష్ణ పంచాయతీ రాజ్ పనులు చేయగా దానికి ఎంబి రికార్డు చేసేందుకు 5000 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.