నడికూడ,నేటిధాత్రి:
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన మేకల సుమన్ మహారాజ్ ఎంపికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఒక ప్రక టనలో తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి మేకల సుమన్ ధన్యవాదాలు తెలిపారు.వరంగల్ పార్లమెంటు ప్రజలంతా చెప్పు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.బహుజన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని మేకల సుమన్ వివరించారు.రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మనదేనని నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే బహుజనులకు న్యాయం జరిగేలా పోరాడుతానని అన్నారు.
వరంగల్ పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థిగా మేకల సుమన్
