లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక
భూపాలపల్లి నేటిధాత్రి:
కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు
భూపాలపల్లి లోని మంజునగర్ లో కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షుడుగా మేకల చంద్రయ్య కోశాధికారిగా రాకేష్ ఉపాధ్యక్షుడిగా ఏనగంటి రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అన్వర్ పాషా సహాయ కార్యదర్శిగా రాసలింగమూర్తి ఎన్నికైనారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మేకల చంద్రయ్య మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించి నన్ను రెండోసారి లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిపించిన సభ్యులందరికీ రుణపడి ఉంటాను నా మీద నమ్మకంతో నన్ను రెండోసారి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గెలుపు నామీద మరింత పనిచేసే భారాన్ని పెంచింది కావున కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ మరింత అభివృద్ధి పథంలోకి నడిపియడానికి నా వంతుగా రెండోసారి కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను