చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాల జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామంలో బుధ వారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని అపోలో ఎన్ఎస్ఆర్ సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ గోపాలపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది గ్రామంలోని ప్రజలందరికీ బీపీ,షుగర్, బ్లడ్ టెస్ట్, ఈసీజీ మరి అనేక టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీవర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, క్యాంపు ఇన్చార్జి సుమన్ రావు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఏక్ రవీందర్ నీల మహేందర్ ఏక్ స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు.