ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం.

seeds seeds

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణ దారులతో సమావేశం

వీణవంక (కరీంనగర్ జిల్లా ):

నేటి ధాత్రి :వీణవంక మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విత్తనాలు, ఎరువుల దుకాణాదారులతో ట్రైనీ ఎస్సై, ప్రాథమిక వ్యవసాయ శాఖ అధికారి తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జమ్మికుంట రూరల్ సీఐ గారి సూచనల మేరకు, వ్యవసాయ అధికారితో కలిసి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు విక్రయించే డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సూచనల మేరకు నకిలీ విత్తనాలు అమ్మకానికి పాల్పడకూడదు.
గుర్తు తెలియని వ్యక్తులకు పురుగుమందులు, క్రిమి కీటకాల మందులు అమ్మకూడదు క్రిమి సహాక మందులు అమ్మేటప్పుడు రైతు ఆధార్, పాస్‌బుక్, జిరాక్స్, ఫోన్ నంబర్ తీసుకొని రిజిస్టర్‌లో నమోదు చేయాలి అని తెలిపారు అంతేకాకుండా
లాట్ నంబర్, పీసీ నంబర్ సరిగా ఉండాలి.
సరైన లైసెన్సు ఉన్నవారే అమ్మకాలు నిర్వహించాలి.
దుకాణదారులు ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బంది హెచ్చరించారు
ఈ సమావేశంలో పలు గ్రామాల ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!