పొలిటికల్ ప్రొఫెసర్ కోదండరాం తో మెడికల్ ప్రొఫెసర్ డాక్టర్ బరిగెల రమేశ్ భేటి

ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఇరువురు

పరకాల నేటిధాత్రి
గురువారం రోజున హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ జాక్ చైర్మైన్ కోదండరాంని తెలంగాణ మెడికల్ జాక్ చైర్మన్ బరిగెల రమేష్ కలిసారు.
ఈ సందర్భంగా అలనాటి ఉద్యమంలో వైద్యులు నిర్వహించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.తనకు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా అవకాశం కల్పించాలని మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ బరిగెల రమేష్ కోరగా
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రoలో గత ప్రభుత్వం ఉద్యమకారులని పట్టించుకోలేదు కానీ కాంగ్రేస్ పార్టీ ఉద్యమకారులకి సముచిత న్యాయం చేస్తూ గౌరవిస్తుందని నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అందులో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా రమేష్ కి అవకాశం వస్తుందని ప్రొఫెసర్ కోదండరాం ఆశాభావం వ్యక్తం చేసారు.అవకాశం ఇస్తే ఉద్యమకారులందర్ని ఏకం చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని రమేష్ ధీమా వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!