టి.ఎస్.ఎఫ్.డి.సి.ఆధ్వర్యంలో కాన్కూర్ లో వైద్య శిబిరం

జైపూర్ , నీటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ( టి.ఎస్.ఎఫ్.డి.సి) ఆధ్వర్యంలో జైపూర్ మండలం లోని మిట్టపల్లి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వారి సహకారంతో మండలంలోని కాన్కూర్ లో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.మంచిర్యాల రేంజ్ పరిధిలోని కాన్కూర్ లో నీలగిరి ప్లాంటేషన్ లో పనులు చేయడానికి వచ్చిన వలస కూలీల సంక్షేమం దృష్ట్యా ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారికి బి.పి,రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు.అదే విధంగా వలస కూలీలకు పని చేసే ప్రాంతంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ కార్యక్రమం లో డివిజనల్ మేనేజర్ శ్రీశ్రావణి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కమలాకర్, కాన్కూర్ సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్, కమ్యూనిటీ హెల్త్ అధికారి రాంమూర్తి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్,సబ్ యూనిట్ అధికారి గుండేటి నాందేవ్, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ లు జి.సురేష్ కుమార్,ఇ.లక్ష్మణ్ , హెల్త్ సూపర్ వైజర్ వసుమతి, హెల్త్ అసిస్టెంట్ మల్లేష్, వార్డు మెంబర్ చందు, ఎ.ఎన్.ఎం రాణి,టి.ఎస్.ఎఫ్.డి.సి సూపర్ వైజర్ రాజేష్,వాచర్ లు శంకర్, సాయి కిరణ్, రాకేష్,ఓదెలు,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!