మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు.!

Sports

మై భారత్ నెహ్రు యువక కేంద్ర మెదక్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు,,,,,

కేంద్ర క్రీడల శాఖ యువజన సర్వీసులు ఉపాధి ఆఫర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో,,,,,

రామాయంపేట యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ నిర్వహణ,,,,

వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ బ్యాడ్మింటన్ సెటిల్ క్రీడల్లో పోటీలు,,,,

యువతలకు, యువకులకు 13 నుండి 29 సంవత్సరా లు,,,,,

కాలేజీ గ్రౌండ్లో 19 మార్చి నుండి 20 వరకు,,,

రామాయంపేట మార్చి18 నేటి ధాత్రి (మెదక్)

Sports
Sports

మైభారత్ యువభారత్ యువ ఉత్సవ్ యువతనుచైతన్య పంచడానికి క్రీడలు యువజన సర్వీసుల శాఖ స్వయం ఉపాధి అవేర్నెస్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని యువతకు ఆటల ద్వారా స్ఫూర్తి కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని సిద్దిపేట నెహ్రూ యువ కేంద్ర అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలుపుతూ రామాయంపేట పట్టణంలో గత 40 సంవత్సరాలుగా క్రీడలకు ప్రోత్సహిస్తూ అనేక శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్న యువజ్యోతి స్పోర్ట్స్ అండ్ యూత్ క్లబ్ కు మెదక్ జిల్లాస్థాయి స్పోర్ట్స్. మీట్ కార్యక్రమాన్ని నెహ్రూ యొక్క కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక యువజ్యోతి నిర్వహిస్తుందని తెలిపారు మెదక్ జిల్లా స్థాయి ఈ పోటీలలో వాలీబాల్ కబడ్డీ ఫుట్బాల్ బ్యాట్మెంటన్ సెటిల్ పోటీలను 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు యువకులకు బాలురకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉచిత గాని క్రీడాకారులకు క్రీడలు నిర్వహిస్తామన్నారు భోజన సదుపాయము కల్పించడంతోపాటు క్రీడల్లో పాల్గొన్న వారికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ క్రీడల వారి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు క్రీడల్లో పాల్గొన్న వారికి అలాగే విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ మెమోటోస్ అందజేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడల్లో పాల్గొనడానికి స్థానిక రామాయంపేట యువజ్యోతి కోఆర్డినేటర్ సత్యనారాయణకు పేర్లు అందజేయాలని కోరారు 9 0 00752850 ఫోన్ నెంబర్ కు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు 18 మార్చి చివరి తేదీ కాగా 19 20 తేదీల్లో క్రీడలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!