జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం
తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్, కోశాధికారిగా ఎండీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
వరంగల్, నేటిధాత్రి
ఉర్దూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి ఐక్యతగా ఉండి సాధించుకోవాలని తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎ మాజీద్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ములుగురోడ్ లోని ముస్లిం కమిటీ సెంటర్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉర్దూ జర్నలిస్టు సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మజీద్ మాట్లాడుతూ జర్నలిస్టులకు రావాల్సిన అక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, ఆరోగ్య భద్రత కార్డులు ఇప్పిచ్చేందుకు ప్రభుత్వంతో, యూనియన్ తరపున పోరాడి సాదించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా ఎండి సాజిద్ పాషా, ప్రధాన కార్యదర్శిగా ఎంఎ నయీమ్, కోశాధికారిగా ఎండి అమీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారితో పాటు గౌరవ సలహాదారులుగా వహీద్ గుల్షాన్, ఎస్ఏం సయీద్, ఇస్మాయిల్ నబి లతో పాటు ఇతర కార్యవర్గాని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ గౌస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అహమ్మద్ జిలాని, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అంజత్ అలీ, ఉప కార్యదర్శి ఫారూక్ అలీ, ఉప కార్యదర్శి సయ్యద్ మాజీ హుసేని, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉర్దూ జర్నలిస్టులు పాల్గొన్నారు.